'ఎంటర్‌టైన్‌మెంట్' పై తమన్నా ఆశలు!

5 Aug, 2014 15:19 IST|Sakshi
'ఎంటర్‌టైన్‌మెంట్' పై తమన్నా ఆశలు!

ముంబై:బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ , పాలబుగ్గల సుందరి తమన్నాల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్. ఈ ఆగస్టు 15 వ తేదీన సినిమా విడుదలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్.. ఓ శునకంతో నటించాడు. ఈ విషయాన్ని అక్షయ్ స్వయంగా ప్రకటించాడు. శునకాలతో దృశ్యాలను చిత్రీకరించడం అంత తేలికమాత్రం కాదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. 'చిన్న పిల్లలతో, శునకాలతో నటించాలంటే చాలా ఓపిక కావాలని'అభిప్రాయపడ్డాడు. ఈ చిత్ర హీరోయిన్ తమన్నాకు మాత్రం ఈ చిత్రం ఒక సవాల్ లాంటిది.

 

బాలీవుడ్ లో అంతకముందు నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తాపడటంతో తమన్నా ఈ చిత్రం గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన తమన్నా..  ప్రతీ ఒక్కరి జీవితంలో గెలుపు- ఓటమి అనేది సహజంగానే జరుగుతూ ఉంటుందని తెలిపింది. కాగా, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంపై ధీమాను వ్యక్తం చేస్తోంది ఈ అమ్మడు. ఇది తప్పకుండా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.