విజయ్ దేవరకొండ.. తక్కువకాలంలోనే ఎక్కువ క్రేజ్ను సంపాదించుకున్న నటుడు. ఎవడే సుబ్రహ్మణ్యంలో తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించినా ఆ తర్వాత హీరోగా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి వరుస హిట్లతో దూసుకుపోయాడు. కానీ ఈ మధ్య కాలంలో విజయ్కు సినిమాల జయాపజయాలు సమానంగా వస్తున్నాయి. ఇక విజయ్ నిర్మాతగా అవతారం ఎత్తిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. కాగా ఇతనికి బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మరోసారి నిరూపితమైంది. ముంబైలో ఫిల్మ్ఫేర్ అవార్డుల కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తన ప్రియుడు రణ్బీర్ కపూర్తో కలిసి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ హాజరైంది.
అలియా భట్ మహిళల విభాగంలో మోస్ట్ స్టైలిష్ స్టార్గా అవార్డు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన స్టైలిష్ స్టార్ల పేర్లు వెల్లడించింది. అమితాబ్ బచ్చన్తో పాటు విజయ్ దేవరకొండ అని చెప్పుకొచ్చింది. విజయ్ స్టైల్ అద్భుతంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్చరణ్ సరసన నటిస్తుంది. మరోవైపు విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక విజయ్ కొద్దిరోజుల క్రితం జూబ్లీహిల్స్లో రూ.15 కోట్ల విలువ చేసే గృహాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.