బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

27 Sep, 2019 11:53 IST|Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో అంటూ రిలీజ్‌ చేసిన పోస్టర్‌, అల్లు అర్జున్‌ డైలాగ్‌ ఎంతగా వైరల్‌ అయిందో అందరికీ తెలిసిందే. నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్‌ తీసుకున్న బన్నీ.. తనపై వచ్చే ప్రశ్నలన్నీంటికి ఒక్క డైలాగ్‌తో పంచ్‌ వేసినట్టు ఫుల్‌ ఫేమస్‌ అయింది.

ఫుల్‌ స్పీడ్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ సాంగ్స్‌ను విడుదల చేసేందకు రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది. మామూలుగా అయితే వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తాడని అందరూ అనుకుంటారు. కానీ, ఈ చిత్రానికి థమన్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. ఈ మూవీలోని పాటలు విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ రెడీగా ఉందని తెలుస్తోంది. పూజా హెగ్డే, టబు, నవదీప్‌, సుశాంత్‌, సునీల్‌ లాంటి తారాగణం నటిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్‌,హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరిన్ని వార్తలు