ముచ్చటగా మూడోసారి

5 Mar, 2019 01:14 IST|Sakshi
అల్లు అర్జున్‌, సుకుమార్‌

వినూత్న సినిమాలను ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటారు దర్శకుడు సుకుమార్‌. అందుకే ‘వన్‌ సైడ్‌ లవ్‌’ అనే కాన్సెప్ట్‌ను ‘ఆర్య’ సినిమాతో అల్లు అర్జున్‌ ద్వారా చెప్పారు. హీరోలో కూడా నెగటివ్‌ షేడ్స్‌ ఉండొచ్చని ‘ఆర్య 2’లో చూపించారు. అందులోనూ అల్లు అర్జునే హీరో. ఈ రెండు చిత్రాలతో బన్నీ (అల్లు అర్జున్‌), సుక్కూ (సుకుమార్‌) కాంబినేషన్‌ అంటేనే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అని ఫిక్స్‌ అయిపోయారు. తాజాగా ఈ కాంబినేషన్‌ వన్స్‌మోర్‌ రిపీట్‌ కానుంది.

బన్నీ, సుక్కూ ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మహాశివరాత్రి స్పెషల్‌గా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీస్‌ బ్యానÆŠపై నవీన్‌ యర్నేని, రవిశంకర్, మోహన్‌ చెరుకూరి‡ నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్‌. ఆ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్‌ సినిమాలు పట్టాలెక్కనుంది. ఈ సినిమా ‘ఆర్య’ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘ఆర్య 3’ అవుతుందా? లేక కొత్త కథతో వస్తారా? వేచి చూడాలి.

మరిన్ని వార్తలు