రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

2 Dec, 2015 18:46 IST|Sakshi
రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

చెన్నై: భారీ వర్షాలు, వరదల వల్ల కష్టాలు పడుతున్న చెన్నై వాసులకు సాయం చేయడానికి టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. చెన్నై వరద బాధితులకు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 'నా జీవిత తొలి రోజుల్లో 18 ఏళ్లు చెన్నైలో గడిపాను. ఆ నగరం నన్ను హీరోను చేసింది. ఐ లవ్ యూ చెన్నై' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

మరో తెలుగు నటుడు సందీప్ కిషన్ 5 వేల ఆహారపు పొట్లాలను చెన్నై వరద బాధితులకు పంపినట్టు తెలిపారు. చెన్నైలోని తన ఇంటి నుంచి వీటిని సమకూర్చినట్టు ట్విట్టర్లో తెలిపారు. వర్ధమాన హీరో సంపూర్ణేష్ బాబు రెండు రోజుల క్రితమే స్పందించి తన వంతుగా 50 వేల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అందజేయనున్నట్టు ట్వీట్ చేశారు. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 5 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు.