హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

19 Aug, 2019 17:20 IST|Sakshi

రీమేక్‌గా తెరకెక్కినప్పటికీ తెలుగు నెటీవిటీకి తగ్గట్టుగా మలిచి, కథనంలో మార్పులు చేసి తీసిన ‘ఎవరు’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం.. అందర్నీ ఆకట్టుకుంటోంది. సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సందర్భంగా ఈ సినిమాపై సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘చిత్రబృందానికి కంగ్రాట్స్‌. నేను గత రాత్రే ఈ సినిమాను చూశాను. మర్డర్‌ మిస్టరీని అనేక మలుపులతో అద్భుతంగా తెరకెక్కించారు. కథనం, సాంకేతిక పరంగా ఈ చిత్రం చాలా బాగుంది. శేష్‌కు ఇది హ్యాట్రిక్‌ మూవీ.. కంటిన్యూస్‌గా మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. రెజీనా, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ చక్కగా నటించారు. నిర్మాత పీవీపీ, దర్శకుడు వెంకట్‌ రామ్‌జీలకు కంగ్రాట్స్‌’అని తెలిపారు. 

మరిన్ని వార్తలు