-
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్దకుమారుడు అల్లు బాబీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నీలు షా అనే యోగా ట్రైనర్ని వివాహం చేసుకున్నారు. బాబీకి కొన్నేళ్ళ క్రితమే పెళ్లి కాగా పలు కారణాల వలన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ముంబైకి చెందిన యోగా ట్రైనర్ నీలూ షా పూణేలోని సింబయాసిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆమె తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు.
ముంబైలో పుట్టిన నీలూ ప్రస్తుతం హైదరాబాద్లో సెటిలయ్యారు. నిరాడంబరంగా వీరి వివాహం జరగగా, అల్లు ఫ్యామిలీతో పాటు చిరు ఫ్యామిలీకి సంబంధించిన కొందరు హాజరైనట్టు తెలుస్తుంది. వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అన్న పెళ్లిలో అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉండడం వలన పెళ్లికి హాజరకాలేకపోయినట్లు తెలుస్తోంది.
అరవింద్కి ముగ్గురు కుమారులైనా ఇద్దరు మాత్రమే అభిమానులకు తెలుసు. అయితే బాలూ తండ్రితోనే ఉంటూ నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్నవారికి బాబీ పరిచయం. బాబీ బయట ఫోకస్ అవడానికి అంతగా ఇష్టపడరు.