కోటకు అల్లు జాతీయ పురస్కారం

12 Sep, 2013 00:46 IST|Sakshi
కోటకు అల్లు జాతీయ పురస్కారం
2013కు సంబంధించి అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం కోట శ్రీనివాసరావుని వరించింది. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్య కళాపీఠం అధ్యక్షులు సారిపల్లి కొండలరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
 
 ఇంతకుముందు ఈ పురస్కా రాన్ని మనోరమ, బ్రహ్మానందం, జానీలీవర్, రాజేంద్రప్రసాద్, కె.విశ్వనాథ్, పద్మనాభం, ఈవీవీ, కైకాల సత్యనారాయణ, తనికెళ్ల భరణి అందుకున్నారు. ఈ నెల 30 విజయవాడలో ఈ పురస్కారాన్ని కోటకు ప్రదానం చేయనున్నారు.