అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ

5 Oct, 2014 20:09 IST|Sakshi

విజయవాడ: దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.