జీవితం ఉన్నది అనుభవించడానికే..

16 Jun, 2020 06:50 IST|Sakshi

జీవితం ఉన్నది అనుభవించడానికేనని నటి అమలాపాల్‌ పేర్కొంది. కరోనా కాలంలో ఎవరైనా ఎంజాయ్‌ చేస్తున్నారు అంటే అది సినిమా హీరోయిన్లే అని చెప్పవచ్చు. ఈ లాక్‌డౌన్‌ కాలంలో నటీ నటులందరూ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతుండడమే ఇందుకు తా ర్కాణం. అందులో ఇల్లు, వంట పనులు సినిమాలు చూడడం మిగిలిన సమయాన్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటించడం వంటి కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. ఇక నటి అమలాపాల్‌ విషయానికొస్తే తను మొదటి నుంచి ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటూ సంచలన నటిగా ముద్ర వేసుకుంది.

దర్శకుడు విజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత రెండేళ్లకే ఆయనకు విడాకులు ఇచ్చి, మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఈమధ్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగింది. కాగా ఇలాంటి పరిస్థితుల్లో నటి అమలాపాల్‌ తాజాగా తాను ఈత దుస్తుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతూ అభిమానుల వివిధ రకాల కామెంట్లకు చేస్తున్నారు. ఒకరు ఫొటోలు చాక్లెట్ల తరహాలో ఉన్నాయంటే..  మరొకరు ఈ లాక్‌డౌన్‌ను నీలాగా ఎవరూ ఎంజాయ్‌ చేయలేరు అని కామెంట్స్‌ చేశారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే. నటి అమలాపాల్‌ తన ఫొటో కింద ఒక క్యాప్షన్‌ కూడా పోస్ట్‌ చేసింది. అందులో విశ్రాంతి సమయంలో ప్రశాంతత కోసం మీరు.. ఎందుకు ఎంజాయ్‌ చేయలేక పోతున్నారు? అని ప్రశ్నించింది. నేటి ప్రపంచంలో ఎన్నో విషయాలను మహిళలు చేయగలుగుతున్నారు. కాగా ఈ అమ్మడి ఫొటోను, కామెంట్‌ను మరో సంచలన నటి మాళవిక మోహన్‌ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేసింది. చదవండి: మానసిక వేదనతో బాధపడుతున్నా

మరిన్ని వార్తలు