వీరజవాన్ల కుటుంబాలకు సూపర్‌స్టార్‌ భారీ విరాళం

16 Feb, 2019 17:10 IST|Sakshi

ముంబై : పుల్వామా దాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలకు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అండగా నిలిచారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున విరాళంగా మొత్తం రూ. 2.5 కోట్లు ప్రకటించారు.  గురువారం జమ్మూ క‌శ్మీర్లో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 49 మంది జ‌వాన్లు అమ‌రులైన‌ సంగ‌తి తెలిసిందే. ఘ‌ట‌న‌పై ప్ర‌పంచం అంతా భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. అదే స‌మ‌యంలో దేశంలోని చాలామంది అమ‌రుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటామంటూ ముందుకు వ‌స్తున్నారు.

మరిన్ని వార్తలు