అమ్మ మంత్రం పని చేసింది

13 Apr, 2020 00:19 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్‌

‘‘అక్షరాలు రెండుగా కనిపిస్తున్నాయి. బొమ్మ బ్లర్‌ అవుతోంది. నాకు ఉన్న ఎన్నో ఆరోగ్య సమస్యలతో పాటు కంటి చూపు కూడా కోల్పోతున్నానేమో?’’ అని ట్వీట్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఎనర్జీతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు అమితాబ్‌. అయితే కొన్ని రోజులుగా కంటి చూపులో తేడా గమనించాను అంటున్నారు ఆయన. ఈ విషయాన్ని సరదాగా తన బ్లాగ్‌ లో రాసుకొచ్చారు.

‘‘చిన్నప్పుడు కళ్లు మంటలుగా అనిపిస్తున్నాయి అని అమ్మకు చెబితే..  చీర కొంగు అంచుని చిన్న బంతిలా చుట్టి అందులోకి గాలి ఊది, కొంగుని కళ్ల దగ్గర ఉంచేది. వెంటనే నొప్పి మాయం అయిపోయేది. ఈ మధ్య కళ్లు మంటలు వస్తున్నాయి. అమ్మ చెప్పిన మంత్రాన్నే మళ్లీ ఫాలో అయ్యాను. అమ్మ మంత్రం మళ్లీ ఫలించింది. అలాగే డాక్టర్‌ని కూడా సంప్రదించాను. ఆయన చెప్పిన మందులు తీసుకున్నాను. కంప్యూటర్‌ ఎక్కువగా వాడటం వల్లే ఇదంతా అని చెప్పారు. ప్రస్తుతం మామూలుగానే చూడగలుగుతున్నాను’’ అని తెలిపారు బచ్చన్‌.

మరిన్ని వార్తలు