‘మాయ’ చేయబోతున్న నీలకంఠ

9 Aug, 2013 01:06 IST|Sakshi
‘మాయ’ చేయబోతున్న నీలకంఠ
ఏ సినిమా చేసినా కొత్తగా చేయాలని తపించే నీలకంఠ ఈ సారి ఓ ‘మాయ’ చేయబోతున్నారు. ‘మాయ’ అంటే వేరే అనుకునేరు. అది ఆయన చేయబోయే సినిమా పేరు. అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో ఈ చిత్రం చేయబోతున్నారు. ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి సమర్పణలో షిరిడీసాయి కంబైన్స్ పతాకంపై డా.ఎం.వి.కె. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 
 
 సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘షో, మిస్సమ్మ, మిస్టర్ మేధావి, విరోధి లాంటి వైవిధ్యభరితమైన సినిమాలు చేసిన నీలకంఠ మరో విభిన్న నేపథ్యంతో ఈ సినిమా చేస్తున్నారు’’ అని తెలిపారు. ‘మాయ’లో నీలకంఠ స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుందని ‘మధుర’శ్రీధర్‌రెడ్డి చెప్పారు.