ఆ నగర్‌లో ఐదుగురు

30 Oct, 2015 23:23 IST|Sakshi

వైవిధ్యమైన కథాంశంతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆనందనగర్‌లో ఐదుగురు’. రామకృష్ణ బొత్స దర్శకత్వంలో యల్లమిల్లి బాలమురళీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రికార్డ్ చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ మూడు పాటలను రికార్డ్ చేశాం. పాటలన్నీ సందర్భానుసారంగా సాగుతాయి. సంగీతదర్శకుడు లక్ష్మణ సాయి అద్భుతమైన స్వరాలందిస్తున్నారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది. ఓ అయిదుగురి జీవితాల చుట్టూ తిరిగే కథ’’ అని తెలిపారు.