క్షణంలా ఉండదు

1 Feb, 2019 03:04 IST|Sakshi
అనసూయ భరద్వాజ్‌

నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ లీడ్‌ రోల్‌లో రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండుపాటలు మినహా పూర్తయింది. అనసూయ మాట్లాడుతూ– ‘‘కథనం’ అంటే కథని నడిపే విధానం. ఫస్ట్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో నాది ‘క్షణం’లో కనిపించిన పాత్రలా ఉన్నట్లు ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ కాదు. ఈ చిత్రంలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేస్తున్నా. ఈ వేసవిలో సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు’’ అన్నారు.

‘‘నేను చిరంజీవిగారి అభిమానిని. డిస్ట్రిబ్యూటర్‌గా అన్నగారి సినిమాతో స్టార్ట్‌ అయ్యాను. పార్ట్‌ టైం ప్రొడ్యూసర్‌గా ‘మంగళ’ చిత్రం చేశాను. ఈ రోజు ఫుల్‌ టైం ప్రొడ్యూసర్‌గా ‘కథనం’ చేస్తున్నాను’’ అని నరేంద్ర రెడ్డి అన్నారు. ‘‘దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. ఈ కథకి అనసూయగారే కరెక్ట్‌. ఈ సినిమా ఇంత వరకు వచ్చిందంటే ధనరాజ్‌గారి దయవల్లేనని చెబుతున్నా’’ అన్నారు రాజేష్‌. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా: సతీష్‌ ముత్యాల, సమర్పణ: ఎమ్‌.విజయ చౌదరి.

మరిన్ని వార్తలు