గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన జబర్దస్త్‌ అనసూయ

15 Sep, 2019 08:41 IST|Sakshi

బంజారాహిల్స్‌: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ మొదలుపెట్టిన గ్రీన్‌ చాలెంజ్‌ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఇచ్చిన గ్రీన్‌ చాలెంజ్‌ను ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ స్వీకరించారు. ఈ మేరకు శనివారం కేబీఆర్‌ పార్క్‌ ముందు జీహెచ్‌ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత తన కొడుకుతో పాటు యాంకర్‌ సుమ కనకాల, నటులు అడవి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్‌ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్‌ చాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అనసూయ పిలుపునిచ్చారు.  
(చదవండి : మాజీ మంత్రికి క్షమాపణలు చెప్పిన అనసూయ)


 

మరిన్ని వార్తలు