నో ఎంట్రీ సీక్వెల్‌ని ప్రకటించిన బోనీ కపూర్‌

27 Aug, 2019 15:47 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ 2005లో నటించిన బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా ‘నో ఎంట్రీ’. ఈ సినిమా విడుదలై సోమవారం నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనిల్‌ కపూర్‌ ఆ చిత్రంలో పాపులర్‌ సరదా సన్నివేశాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ సన్నివేశంలో అనిల్‌, ఫర్దీన్‌ ఖాన్‌కు పాజిటివ్‌గా ఉండమని సలహా ఇస్తుంటాడు.‘నా రక్తంలో సానుకూలత ప్రవహిస్తోంది, ఎందుకంటే నో ఎంట్రీ సినిమాకు 14 ఏళ్లు’ అనే క్యాప్షన్‌తో అనిల్‌ కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్ట్‌ చేశాడు. దర్శకుడు అనీస్‌ బాజ్‌మీ దర్శకత్వంలో ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, ఫర్దీన్‌ ఖాన్‌లు హీరోలగా నటించగా.. బిపాస బసు, లారా దత్త, ఇషా డియోల్‌లు హీరోయిన్‌లుగా నటించారు.

అదే విధంగా ఈ సినిమా నిర్మాత బోని కపూర్‌ కూడా ‘2005లో అత్యంత ఘన విజయం సాధించిన ‘నో ఎంట్రీ’కి నేటితో 14 ఏళ్లు! తొందరల్లోనే మనందరం ‘నో ఎంట్రీ2’ తో మళ్లీ కలవబోతున్నందుకు సంతోషం’ అంటూ తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘నో ఎంట్రీ2’ డైరెక్టర్‌ అనీస్‌​ బాజ్‌మీకి, చిత్ర బృందానికి బోనీ ధన్యవాదాలు తెలిపాడు. ‘నో ఎంట్రీ’ని తెరకెక్కించిన దర్శకుడు అనీస్‌ బాజ్‌మీనే దాని సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నారు. సల్మాన్‌ ఖాన్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు