మహేశ్‌ బాబుకు అనిల్‌ ఫ్యామిలీ మెసేజ్‌..

15 Jan, 2020 20:17 IST|Sakshi

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అనిల్‌కు అవకాశం కల్పించినందుకు ఆయన కుటుంబ సభ్యులు మహేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పండగ ముందుగానే బ్లాక్‌బస్టర్‌కా బాప్‌ ఇచ్చారని అన్నారు. మహేశ్‌ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్‌ ఈ చిత్రంలో డ్యాన్స్‌లు ఇరగదీశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్‌ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

అలాగే అనిల్‌ కుటుంబానికి నమ్రత కృతజ్ఞతలు తెలిపారు. బిగ్గెస్ట్‌ బ్లాక్‌బాస్టర్‌ ఇచ్చినందుకు అనిల్‌కు ధన్యవాదాలు చెప్పారు. కాగా, మహేశ్‌, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత లేడి అమితాబ్‌ విజయశాంతి ఈ చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో మహేశ్‌, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

My director @anilravipudi 's family !! Thankyou all for the sweetest message 🙏🙏😍 Anil sir ,Thank you for giving us the biggest blockbuster in #SarileruNeekevaru 😍😍 We at @gmbents and @urstrulymahesh are grateful and humbled by ur love, sincerity and passion🤗🤗 Looking forward to another blockbuster soon enough 🙏🙏🙏🙏

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

మరిన్ని వార్తలు