అంజలి నటనే హైలైట్

1 Feb, 2015 00:27 IST|Sakshi

అంజలి కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘తమ్మివెటైతై సుందరం’. ‘సింహాద్రిపురం’ పేరుతో ఈ చిత్రాన్ని శ్రీ పూర్ణి క్రియేషన్స్ పతాకంపై బళ్లారి సాగర్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. వడివుడియాన్ దర్శకుడు. విద్యాసాగర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదల య్యాయి. అంజలి నటనే హైలైట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత డి.నారాయణ తెలిపారు.