హ‌ర్ట్ అయ్యుంటే సారీ చెప్తాను: అనురాగ్‌

23 Jul, 2020 10:06 IST|Sakshi

హీరోయిన్‌ కంగ‌నా ర‌నౌత్ ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో బాలీవుడ్ బ్యూటీలతోపాటు ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌ను సైతం ఏకిపారేసింది. అందులో ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ కూడా ఉన్నారు. ఆయ‌న‌ను ఆమె 'మినీ మ‌హేశ్ భ‌ట్' అని సంబోధించారు. దీనిపై క‌లత చెందిన ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఆమె అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కావ‌డం లేదద‌ని వాపోయారు. ఒకానొక స‌మ‌యంలో త‌న‌కు కంగ‌నా మంచి మిత్రురాల‌ని, ఆమెకు సినిమాల్లో స‌హాయం చేశాన‌ని, కానీ ఇప్పుడు త‌ను పూర్తిగా మారిపోయింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. (అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన)

త‌న‌కు కంగ‌నా, తాప్సీ ఇద్ద‌రూ స్నేహితుల‌ని, వారిద్దరి మ‌ధ్య‌ గొడ‌వ‌ల‌ను స‌ర్ది చెప్పేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ స‌ఫ‌లం కాలేద‌న్నారు. పైగా ఈ విష‌యం గురించి ఆమెకు చేసిన మెసేజ్‌ల‌ను కూడా సోష‌ల్ మీడియాలో పెట్టి ర‌చ్చ చేసింద‌న్నారు. కానీ తాను ఒక‌ స్నేహితుడిగానే ఆమె స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌నుకున్నానని తెలిపారు. ఒక‌వేళ తాను నిజంగానే ఆమెను బాధ‌పెట్టి ఉంటే అందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్ధ‌మేమేన‌ని చెప్పుకొచ్చారు. అయితే ఎవ‌రైతే ఆమె వైపు నిల‌బ‌డ‌రో వారంద‌రినీ కంగ‌నా శ‌త్రువులుగానే చూస్తోంద‌ని అనురాగ్ పేర్కొన్నారు. (ఇండియా నుంచి ఈ ఇద్దరూ..)

మరిన్ని వార్తలు