సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘భాగమతి’

18 Jan, 2018 15:25 IST|Sakshi

అనుష‍్క ప్రధాన పాత్రలో పిల్లజమీందార్‌ ఫేం అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్‌ మూవీ భాగమతి. అరుంధతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో సత్తా చాటిన అనుష్క భాగమతితో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది.

థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ ను జారీ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్‌లతో సినిమా మీద మరింత హైప్ క్రియేట్‌ అయ్యింది. అనుష్క లీడ్‌ రోల్‌ లోనటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, విద్యుల్లేఖ రామన్‌ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిపబ్లిక్‌ డే కానుకగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి భాగమతి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు