ముచ్చటగా మూడోసారి...

12 Feb, 2015 23:26 IST|Sakshi
ముచ్చటగా మూడోసారి...

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన ‘సింగమ్’లో అనుష్క కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్‌లో కూడా ‘కావ్యామహాలింగం’ పాత్ర చేశారామె. ఇప్పుడు ‘సింగమ్ 3’ చేయడానికి హరి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రం గురించి ఇటీవల అనుష్కను సంప్రదించారట. అన్నీ కుదిరితే మూడోసారి కావ్యామహాలింగంగా ఆమె ప్రేక్షకుల ముందుకొస్తారు. రెండు భాగాల్లో నటించిన సూర్య మూడో సింగమ్‌గా నటిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.