స్వీటీ మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం? 

12 Jun, 2020 20:58 IST|Sakshi

‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’, ‘భాగమతి’ వంటి సూపర్‌డూపర్‌హిట్‌ చిత్రాలతో ఫుల్‌ క్రేజ్‌ సాధించిన స్టార్‌ హీరోయిన్‌ స్వీటీ అనుష్క. ఇప్పటికే దక్షిణాదిన భారీ బడ్జెట్‌తో కూడిన‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. ప్రస్తుతం హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనేదానిపై దర్శకనిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. (సెన్సార్‌ పూర్తి.. సస్పెన్స్‌ అలానే ఉంది!)

అయితే ‘నిశ్శబ్దం’ సినిమా గురించి కాస్త పక్కన పెడితే.. అనుష్క మరో భారీ లేడీ ఓరియెంట్‌ చిత్రానికి కమిట్‌ అయిందని సమాచారం. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ నిర్మించనుందని టాక్‌. ఇప్పటికే యువీ క్రియేషన్స్‌లో మిర్చి, భాగమతి చిత్రాలను స్వీటీ చేసిన విషయం తెలిసిందే. సందీప్‌ కిషన్‌తో ‘రారా కృష్ణయ్య’ తీసిన పి. మహేశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు