పొల్లాచ్చిలో ఎన్టీఆర్‌ ఆటా పాటా

10 Jun, 2018 16:35 IST|Sakshi

జై లవ కుశ సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ జూన్‌ 18 నుంచి పొల్లాచ్చిలో ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్‌. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లతో పాటు కీలక నటీనటులు పాల్గొననున్నారు.

మూడు వారాల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ఒక పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే మరో భారీ షెడ్యూల్‌ కోసం యూరప్‌ వెళ్లనున్నారు. ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు