‘వయొలెన్స్‌ నీ డీఎన్‌ఏలోనే ఉంది’

2 Oct, 2018 20:46 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్- పూజా హెగ్డే జంటగా‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’..  ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ఎన్టీఆర్‌ లుక్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మంగళవారం (అక్టోబర్‌ 2) రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను నోవాటెల్‌ హోటల్లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా థియరిటికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఫారిన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్‌, పూజా హెగ్డేల పరిచయంతో ట్రైలర్‌ మొదలౌతుంది.  పూజా పేరు తెలుసుకోవాలనుకున్న ఎన్టీఆర్‌కు.. ‘పేరు మాత్రమే చాలా.. ఇంకా అడ్రస్‌ కూడా చెప్పాలా’అనే సమాధానమొస్తుంది. ఇక సమస్యను (ఫ్యాక్షనిజాన్ని) రూపుమాపడం ఒక్క అడుగు దూరంలోనే ఉందంటూ ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్‌తో ముగుస్తుంది. ‘వయొలెన్స్‌ నీ డీఎన్‌ఏలోనే ఉందంటూ’ సాగే త్రివిక్రమ్‌ మార్కు డైలాగులతో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

‘ఫ్యాక్షనిజం అనే పదం విన్నావా.. అర్థం కాలేదు కదా’ అంటూ పూజా ఎన్టీఆర్‌ను అడగడం...ఆ వెంటనే ‘ఈడ మందిలేరా కత్తుల్లేవా అంటూ ఎన్టీఆర్‌ యాక్షన్‌ సీన్‌లో కనిపించడం చూస్తుంటే ఎన్టీఆర్‌ రెండు భిన్న కోణాలు గల పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది. కాగా ఈ చిత్రం అక్టోబర్‌ 11న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు