సోనియా అగర్వాల్, అర్చన, వినోద్కుమార్, రవిప్రకాశ్, శివాజీ రాజా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘తరువాత కథ’. ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్. పద్మజ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వినూత్న కథాంశంతో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం ఇదనీ, ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందనీ నిర్మాత పద్మజ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ, కథనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. పార్వతీ చంద్ ఇచ్చిన సంభాషణలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తారక రామారావు నేపథ్య సంగీతం, ఉదయ్భాస్కర్ జాస్తి ఫొటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతాయి’’ అని చెప్పారు.