నీకు ఓకేనా...

30 May, 2014 23:44 IST|Sakshi
నీకు ఓకేనా...

శ్రీ సుమంత్, వందన, మధుమిత్ర హీరో హీరోయిన్లుగా రత్నగిరి .డి దర్శకత్వంలో రత్నంహరి కుప్పాల నిర్మిస్తున్న ‘నాకు ఓకే... నీకు ఓకేనా’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సగం సిటీలోనూ, మిగతా సగం పల్లెటూరి నేపథ్యంలోనూ ఉంటుంది. రాజమండ్రిలో 5 వేల మందితో కొన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: సురేష్.