మా నాన్న కోసమే అదంతా చేశాను: అర్జున్‌ కపూర్‌

26 May, 2019 19:46 IST|Sakshi

ముంబై : తన తండ్రి బోనీకపూర్‌ కోసమే పినతల్లి కూతుళ్ల(నటి శ్రీదేవి కుమార్తెలు)తో కలిసిపోయానని బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ తెలిపారు. జాహ్నవి, ఖుషిలు తన జీవితంలోకి రావటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జాహ్నవి, ఖుషిలతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘గత కొద్ది కాలంగా  జాహ్నవి, ఖుషిలతో కలిసుండటం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. మన జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినపుడు వారికోసం కొంత సమయాన్ని కేటాయించక తప్పదు. మేము కలిసి ఎక్కువ సమయాన్ని గడపటానికి చూస్తుంటాం. మా అదృష్టం కొద్ది కలిసి గడపటానికి సమయం ఉంటోంది. జాహ్నవి కావచ్చు, ఖుషి కావచ్చు ఎవరి వ్యక్తిగతమైన ప్రాధాన్యతలు వారికి ఉన్నాయి. అందుకే మేము కలిసి ఉండటం లేదు. వాళ్లు నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మా నాన్న కోసమే ఇదంతా చేశాన’’ని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు