జాన్వీ సినిమా: అర్జున్‌ ఎమోషనల్‌ పోస్ట్‌‌!

11 Jun, 2018 09:41 IST|Sakshi

ప్రముఖ నటి శ్రీదేవి మరణించిన తర్వాత అర్జున్‌ కపూర్‌ తన తండ్రి బోని కపూర్‌తో పాటు చెల్లెలు జాన్వీ, ఖుషీలకు అండగా నిలబడుతూ వస్తున్నారు. అర్జున్‌ మాత్రమే కాదు అన్షులా కూడా వారితో ప్రేమగా ఉంటున్నారు.  జాన్వీ వెండితెరకు పరిచయమవుతున్న ధడక్‌ మూవీ ట్రైలర్‌ను సోమవారం రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే. జాన్వీ నటించిన తొలి చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ కానున్న కొన్నిగంటల ముందు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మనస్సుకు హత్తుకునేలా ఓ పోస్ట్‌ చేశారు.

‘సోమవారం నీ ట్రైలర్‌ రిలీజ్‌ అవుతుంది.. ఇక నువ్వు ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచిపోతావు. నేను ముంబైలో లేనందుకు సారీ.. కానీ ఎప్పుడు నేను నీ వైపే ఉంటాను. నువ్వు బాగా కష్టపడుతూ, నిజాయితీగా ఉంటూ, ఇతరుల అభిప్రాయాలకు గౌరవిస్తూ, నీకంటూ ప్రత్యేక పంథాను ఏర్పరుచుకుంటే ఈ ఫీల్డ్‌ నీకు చాలా గొప్పగా ఉంటుంది. ఇది చాలా కష్టమైనది కానీ నువ్వు వీటన్నింటికి సిద్ధంగా ఉన్నావని తెలుసు. అల్‌ ది బెస్ట్‌ ధడక్ టీమ్‌‌, నా మిత్రులు కరణ్‌ జోహార్‌, శశాంక్‌లు నిన్ను, ఇషాన్‌ను మోడ్రన్‌ రోమియో, జూలియట్‌లుగా తీర్చిదిద్ది ఉంటారు’  అని చెల్లిపై తన ప్రేమను చాటుకున్నారు అర్జున్‌ కపూర్‌. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘సైరట్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు