అన్యాయంపై పోరాటం

21 Nov, 2019 06:17 IST|Sakshi
లావణ్యా త్రిపాఠి, నిఖిల్‌

నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘మేము ఎంతో శ్రమించి తీసిన చిత్రమిది. అన్యాయాన్ని ఎదిరించే ఒక రిపోర్టర్‌ పాత్రలో నేను నటించాను’’అన్నారు నిఖిల్‌. ‘‘ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు సంతోష్‌. ‘‘ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి.

మరిన్ని వార్తలు