'నాలోని నటుణ్ని గుర్తించింది అతనే'

4 Aug, 2016 14:41 IST|Sakshi
'నాలోని నటుణ్ని గుర్తించింది అతనే'

విలక్షణ పాత్రలతో సౌత్ నార్త్ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బొమన్ ఇరానీ. మున్నాభాయ్ ఎంబిబియస్ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అయిన బొమన్ ప్రస్తుతం 'ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' సినిమాలో నటించాడు.  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన తెరంగేట్రానికి సంబందించిన విశేషాలను తెలియజేశాడు.

సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న బొమన్ తొలిసారిగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కొరియోగ్రాఫ్ చేసిన నాటకంలో నటించాడు.  ఆ తరువాత అర్షద్ ప్రోత్సాహంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బోమన్ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో అర్షద్తో కలిసి నటించాడు.

ప్రస్తుతం ఐదోసారి ఈ జోడి 'ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' సినిమాతో నవ్వులు పూయించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తనలోని నటుణ్ని గుర్తించిన అర్షద్కు కృతజ్ఞతలు తెలియజేసిన బొమన్ ఇరానీ.. మరోసారి అతనితో కలిసి నటిచటం ఆనందంగా ఉందని తెలిపాడు.