ఐదు కథలను కలిపే పాత్ర

3 Dec, 2014 22:27 IST|Sakshi
ఐదు కథలను కలిపే పాత్ర

 ఆర్యన్ రాజేశ్, మాదాల రవి, కిరణ్, ఉత్తేజ్, చిన్నా ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘పంచముఖి’. చల్లా భానుకిరణ్ దర్శకుడు. యార్లగడ్డ కిరణ్ నిర్మాత.  ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నటుడు మాదాల రవి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అయిదు కథలుంటాయి. ఆ కథలను కలిపే పాత్రను నేను పోషించాను. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. వెండితెరపై ఇప్పటివరకూ కొన్ని వేల సినిమాలు విడుదలయ్యాయనీ, వాటన్నింటిలో తమ సినిమా భిన్నమైందని దర్శకుడు నమ్మకంగా చెప్పారు. ఆద్యంతం ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇదని నటుడు కిరణ్ అన్నారు.