కన్నడంలో నిన్ను కోరి

21 Mar, 2020 06:13 IST|Sakshi
ధృవ్‌ సార్జా

నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా 2017లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్‌ అవుతోంది. అథర్వా మురళి, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ‘తలళ్లి పోగాదే’ టైటిల్‌తో ఈ రీమేక్‌ తెరకెక్కుతోంది. తాజాగా కన్నడంలోనూ ‘నిన్ను కోరి’ రీమేక్‌ కాబోతోందని సమాచారం. కన్నడ పాపులర్‌ నటుడు ధృవ్‌ సార్జా ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. నంద కిశోర్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు