గణతంత్ర దినోత్సవానికి షురూ

12 Dec, 2019 00:22 IST|Sakshi
రాహుల్‌ విజయ్‌

శ్రీను వైట్ల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బీవీ సూర్య దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రముఖ సీనియర్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ మాస్టర్‌ తనయుడు రాహుల్‌ విజయ్‌ ఈ చిత్రంలో కథానాయకునిగా నటించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, ప్యాషనేట్‌ ఫిలిం మేకర్‌ చింతా గోపాలకృష్ణారెడ్డి  శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26న) ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొం దనున్న చిత్రమిది. జనవరి 27న రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఈశ్వర్‌ యెల్లు మహంతి, కథ– స్క్రీన్‌ ప్లే– డైలాగ్స్‌– దర్శకత్వం: బీవీ సూర్య.

మరిన్ని వార్తలు