బాబోయ్ ‘కాకి’!

16 Jun, 2015 23:53 IST|Sakshi
బాబోయ్ ‘కాకి’!

‘కాకి’ పేరుతో ప్రేక్షకులను భయపెట్టడానికి ఓ చిత్రం రానుంది. అశోక్, మేఘశ్రీ, శ్రుతీ రామ కృష్ణన్ ముఖ్యతారలుగా అర్పితా క్రియేషన్స్ పతాకంపై మనోన్ యం దర్శకత్వంలో  పత్తికొండ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే  వైజాగ్‌లో  మొద లైంది. ముహూర్తపు దృశ్యానికి శ్రీమతి సంధ్య స్విచ్చాన్ చేయగా, నిర్మాత  సోదరుడు పత్తికొండ కిశోర్ క్లాప్ నిచ్చారు.

‘‘లవ్, హర్రర్, థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఆసక్తికరమైన కథతో రూపొందించనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కథకుడు: రోనాల్డ్ రాజ్ ఎస్.విలియమ్స్.