బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం 

22 Mar, 2020 10:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ వినోద చానెల్‌ జీ తెలుగు ‘బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది.  ఈ కార్యక్రమంలో ఆదివారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది సంబరాల సందర్భంగా పూర్ణాలు, పూతరేకులు, గారెలు, పులిహోర, ఉగాది పచ్చడి, ఉలవచారు, పప్పు చారు, గుత్తి వంకాయ కూర, చల్ల మిర్చి...వంటి అచ్చ తెలుగు వంటకాల విశిష్టతకు అద్దం పడతూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది.  హీరోయిన్‌ అనుష్క ప్రధాన ఆకర్షణగా.. నటుడు నాగబాబు, ఆయన కుమార్తె నీహారిక, యాంకర్స్‌ అనసూయ భరద్వాజ్, ప్రదీప్‌ మాచిరాజు, రవి, పలువురు డ్యాన్స్‌ మాస్టర్స్‌... పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా తమ నటనతో అదరగొట్టారు. నీహారిక ... ‘ఓ మై డాడీ’  అంటూ మైక్‌ పట్టి పాట పడితే... అనసూయ... ‘మహానటి’ గా అభినయించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌ అయింది.

మరిన్ని వార్తలు