గ్యాంగ్‌ వార్‌

17 Mar, 2018 00:29 IST|Sakshi
అవినాష్

‘మంగళ’, ‘క్రిమినల్స్‌’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోన్న మరో డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వెపన్‌’. అవినాష్, ప్రదీప్‌ రావత్, రాజారాయ్, రాజు, మధుబాబు ప్రధాన  పాత్రల్లో ఆర్‌.ఎస్‌.సురేష్‌ దర్శకత్వంలో శర్మ చుక్కా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ మార్చి 20న మొదలవుతుంది.

శర్మ చుక్కా మాట్లాడుతూ– ‘‘రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్‌ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్‌కి పూర్తి జస్టిఫికేషన్‌ ఇచ్చే కథాంశంతో మా సినిమా ఉంటుంది. మా బ్యానర్‌లో వచ్చిన ‘మంగళ, క్రిమినల్స్‌’ చిత్రాల కంటే ‘వెపన్‌’ మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సబ్బారపు ప్రకాష్‌. 

మరిన్ని వార్తలు