ఫైట్‌తో షురూ

3 Mar, 2020 00:37 IST|Sakshi
బాలకృష్ణ

‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా సోమవారం మొదలైంది. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌  కంపోజ్‌ చేసిన ఫైట్‌తో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటినుండి  ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటుంది. ‘సామజవరగమన....’ అంటూ ఫుల్‌ జోష్‌లో ఉన్న ఎస్‌.ఎస్‌. తమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.

>
మరిన్ని వార్తలు