వెరైటీ మాస్‌

5 Oct, 2019 01:20 IST|Sakshi
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

‘రాక్షసుడు’ సినిమాతో ఈ ఏడాది సూపర్‌ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుని మంచి ఫామ్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఇదే ఉత్సాహంలో తన తర్వాతి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే పనులను మొదలుపెట్టారు. ఈ కొత్త సినిమాకు ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తారు. సాయి శ్రీనివాస్‌ కోసం ఓ పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథను సిద్ధం చేశారట సంతోష్‌. ఈ మాస్‌ కథ చాలా వెరైటీగా ఉంటుందట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు