గత రెండు, మూడేళ్లుగా సినీ వార్తలో నిత్యం నానుతున్న సినిమా 'బాహుబలి'. ప్రస్తుతం బాహుబలి రెండవ భాగం సెట్స్ మీదున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తెలియాల్సిందల్లా భల్లాలదేవ భార్య ఎవరన్నది? లావణ్య త్రిపాఠి అన్నారు.. ఒట్టి రూమన్స్ అంటూ కొట్టిపారేసింది. శ్రియానా అంటే.. నేను కాదు, నన్నడిగితే మాత్రం ఓకే చెప్పేస్తానంది. దాంతో ఇద్దరూ కాదని తేలిపోయింది. మరెవరు? బాహుబలి మొదటి భాగంలో భల్లాలదేవ కుమారుడిగా అడవి శేష్ నటించారు. కానీ అతని తల్లిని మాత్రం చూపించలేదు.
ఇదే విషయాన్ని రానాని అడిగితే.. 'భల్లాలదేవకు సింహాసనంతో రొమాన్స్ చేయడానికే సమయం అంతా సరిపోతుంది. అయినా తరువాయి భాగంలో ఏముంటుందనేది త్వరలోనే తెలుస్తుంది.. దాచాల్సింది ఏముంది?' అంటూ తెలివిగా తప్పించుకున్నాడు. రెండవ భాగంలో విలన్గా విశ్వరూపం చూపెడుతానంటున్నాడు ఈ టాలీవుడ్ కండలవీరుడు. మొత్తానికి భల్లాలదేవ భార్య ఎవరో ఎప్పుడు తెలుస్తుందో.. !