రెండు పాటలకు ఆరు కోట్లు

10 May, 2018 12:13 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్‌ అనే నేను. శ్రీమంతుడు లాంటి ఘన విజయాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ మరోసారి హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్‌ లో భాగంగా యూనిట్‌ సభ్యులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో హీరో మహేష్‌ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో కీలక సన్నివేశాలు అసెంబ్లీ నేపథ్యంలో తెరకెక్కించారు. అందుకోసం 2 కోట్లతో అసెంబ్లీ సెట్‌ వేసినట్టుగా తెలిపారు. ఈ సెట్‌లో పలు సన్నివేశాలతో పాటు ‘హామీ ఇస్తున్నా’ పాటకు సంబంధించిన సీన్స్‌ కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సూపర్‌ హిట్ అయిన ‘వచ్చాడయ్యో సామీ’ పాట కోసమే నాలుగు కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మహేష్ సరసన కిరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు