రెండో రైడ్‌కు రెడీ

25 Apr, 2020 04:19 IST|Sakshi
అజయ్‌ దేవగన్

అజయ్‌ దేవగన్‌ హీరోగా రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రైడ్‌’ (2018) చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను కూడా రాబట్టిందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘రైడ్‌ 2’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ‘రైడ్‌’ చిత్రనిర్మాతల్లో ఒకరైన భూషణ్‌కుమార్‌ తెలిపారు. ‘‘ప్రస్తుతం ‘రైడ్‌ 2’ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. తొలి పార్ట్‌ సక్సెస్‌ సాధించింది. దీంతో సీక్వెల్‌పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునేలా సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు భూషణ్‌కుమార్‌.

మరిన్ని వార్తలు