ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

19 Sep, 2019 15:08 IST|Sakshi

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొన్ని మలుపులు, మరికొన్ని ట్విస్టులతో నడుస్తోంది. షో ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏడుగురిని ఇంటికి పంపించేయగా పది మంది టైటిల్‌ బరిలో ఉన్నారు. ఈ వారానికిగానూ రాహుల్‌, మహేశ్‌, హిమజలు ఎలిమినేషన్‌లో ఉన్నప్పటికీ హిమజ డేంజర్‌ జోన్‌లో ఉంది. కాగా బిగ్‌బాస్‌ నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులతో క్రేజీ కాలేజీ టాస్క్‌ ఆడించాడు. ఈ టాస్క్‌లో న్యాయనిర్ణేతలు బాబాభాస్కర్‌, వితికలు ఏకాభిప్రాయంతో రాహుల్‌-హిమజల జంటను విజేతగా ప్రకటించారు. ఇక రాహుల్‌ పాట, హిమజ ఆటతో హౌస్‌లో సందడి నెలకొంది. వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తుంటే పునర్నవి పగలబడి నవ్వింది. శివజ్యోతి ఏడుపుతో ప్రారంభమైన ఎపిసోడ్‌ ఇంటిసభ్యుల నవ్వులతో ముగిసింది.

ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పార్టిసిపెంట్స్‌ అందరూ బిగ్‌బాస్‌ అనే గొడుగు కింద చేరి, తొమ్మిదివారాలుగా ఇంటితో సంబంధం లేకుండా గడుపుతున్నారు. వారి కోపాలు, ప్రేమలు ఏవైనా సరే ఇంటిసభ్యుల మీదే చూపించుకున్నారు. చాలా రోజుల ఎడబాటు అనంతరం వారికి ఇంటిసభ్యులు కనిపిస్తే, మాట్లాడటానికి అవకాశమిస్తే వారి ఆనందానికి అంతే ఉండదు. ప్రస్తుత ఎపిసోడ్‌లో అదే జరగబోతోంది. ఫన్నీటాస్క్‌లు, కఠినతరమైన గేమ్స్‌ ఆడించిన బిగ్‌బాస్‌ నేటి ఎపిసోడ్‌లో కాస్త ఊరట కలిగించనున్నాడు. పార్టిసిపెంట్స్‌కు తమ తమ కుటుంబీకులను కళ్ల ముందు ప్రవేశపెట్టాడు. రక్త సంబంధీకులను చూడగానే ఇంటిసభ్యులంతా భావోద్వేగానికి లోనయ్యారు. కొంచెం ఆనందం మరికొంచెం బాధతో వారి కన్నీళ్లు ధారలు కట్టాయి. దీంతో ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్‌ అందరి మనసులను కుదిపేయనుందనటంలో సందేహం లేదు.

మరిన్ని వార్తలు