బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

7 Sep, 2019 19:39 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి.. టాస్క్‌లో గట్టిపోటి ఇచ్చింది శిల్పా చక్రవర్తి. అందరూ ఏకమై తన మీద పడ్డా.. పట్టు వదలకుండా గట్టిగా నిల్చుంది. దొంగల రాణి క్యారెక్టర్‌కు తగ్గట్టు తెగువ చూపించింది. అలీ, శ్రీముఖి, హిమజ, వితికా ఎంత ప్రయత్నించినా.. తన వద్ద నుంచి తుపాకీని లాక్కోలేకపోయారు. చివరకు తనను సింహాసనం నుంచి పక్కకు తప్పించాలని చూసినా.. రాహుల్‌, వరుణ్‌, అలీ సహాయంతో చివరి వరకు ప్రయత్నించసాగింది.

ఈ క్రమంలో ఎన్ని గాయాలైనప్పటికీ వెనుదిరగలేదు. స్విమ్మింగ్‌పూల్‌లో కూడా శిల్పాపై అందరూ దాడి చేసేందుకు ప్రయత్నించినా పట్టువదలకుండా ఉంది. అయితే ఆ టాస్క్‌లో శిల్పా బాగానే గాయపడింది. టాస్క్‌లో ఎంతో బాధను భరిస్తూ.. చివరకు కన్నీరు పెట్టుకుంది. హింస శ్రుతిమించడంతో బిగ్‌బాస్‌ ఆ టాస్క్‌ను రద్దు చేసేశాడు. ఇక వీకెండ్‌లో నాగ్‌ ఇదే విషయంపై హౌస్‌మేట్స్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన బాధను చెప్పుకుంటూ శిల్పా కన్నీరు పెట్టుకుంది. ఓడిపోవాలని ఎవరో అన్నట్లు, ఆ మాట తనకు నచ్చలేదని.. ఈ ఇంట్లో గార్లు, జీలు అని అనొద్దు.. మీ ప్రవర్తనలో కొంచెం రెస్పెక్ట్‌ ఇస్తే చాలు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. మరి వీటిపై నాగ్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు