బిగ్‌బాస్‌: డేంజర్‌ జోన్‌లో అక్కాతమ్ముళ్లు

27 Oct, 2019 16:58 IST|Sakshi

బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ నేటితో పద్నాలుగు వారాలు పూర్తి చేసుకోనుంది. పదిహేను మందితో ప్రారంభమైన ఈ  బిగ్‌బాస్‌ సీజన్‌లో రెండు వెల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు కూడా ఉండటంతో ఇంటి సభ్యుల సంఖ్య పదిహేడుకు చేరింది. ఇప్పటివరకు 11 మంది హౌస్‌ను వీడగా ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఈ ఆరుగురిలో ఇప్పటికే రాహుల్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు టికెట్‌ టు ఫినాలే దక్కించుకుని టాప్‌ 5లోకి అడుగు పెట్టారు. వరుణ్‌, అలీ రెజా, శివజ్యోతి నామినేషన్‌లో కొనసాగుతున్నారు. 

అయితే, వరుణ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగానే ఉండటంతో అతను సేఫ్‌ జోన్‌లోనే ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఇక అక్కాతమ్ముళ్లు శివజ్యోతి, అలీరెజా మాత్రం డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వైల్డ్‌ కార్టుతో రీఎంట్రీకి అలీకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉండేది. కానీ, అదిప్పుడు పూర్తిగా పడిపోయింది. రీ ఎంట్రీ అనేది అలీకి పెద్ద మైనస్‌గా మారింది. బయట పరిస్థితులు, బిగ్‌బాస్‌కు సంబంధించి గేమ్‌ ప్లాన్లు తెలుసుకుని వచ్చాడని అందరూ అలీనీ పక్కన పెట్టేశారు. దీంతో ఎలిమినేషన్‌ తప్పించుకోవడానికి అలీకి ఈ సారి తక్కువ ఓట్లే పడ్డాయి.

కానీ అతని కన్నా తక్కువ ఓట్లతో శివజ్యోతి చిట్ట చివరి స్థానంలో ఉంది. గత కొన్ని వారాలుగా శివజ్యోతి ప్రవర్తన నచ్చట్లేదంటూ నెటిజన్లు ఆమెను పంపిచడానికి సిద్ధమైపోయారు. ఏడుపు అనేది ఒక ఎమోషన్‌ అని చెప్పిన శివజ్యోతి మాటలను ప్రేక్షకులు పట్టించుకోలేదు. తన సాగదీత సమాధానాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వరుణ్‌, వితికలతో గొడవ కూడా ఓట్లకు గండి కొట్టింది. టాస్క్‌లు బాగానే ఆడినప్పటికీ అదొక్కటే టైటిల్‌ అందుకోడానికి సరిపోదనేది ఈమె విషయంలో అర్థమవుతోంది. దీంతో నేడు శివజ్యోతి ఎలిమినేట్‌ కానున్నట్టు సమాచారం. ఈ సీజన్‌లో ఇదే చివరి ఎలిమినేషన్‌ కాగా రేపటి నుంచి అయిదుగురు హౌస్‌మేట్స్‌ మధ్య ఫైనల్‌ పోరు జరుగనుంది.

మరిన్ని వార్తలు