బిగ్బీ అమితాబ్ బచ్చన్, రణ్బీర్కపూర్, అలియాభట్లాంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లోగోను కాసేపటి క్రితమే రివీల్ చేసింది చిత్రయూనిట్.
ఈ మూవీ లోగోను ప్రయాగ వద్ద జరుగుతున్న కుంభమేళాలో ఆవిష్కరించారు. డ్రోన్లను అమర్చి ఆకాశంలో బ్రహ్మాస్త్ర లోగోను రివీల్ చేయడం అందర్నీ ఆశ్యర్యపరిచింది. పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం.. లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రణ్బీర్ కపూర్, అలియా భట్, అయాన్ ముఖర్జీ పాల్గొన్నారు. ధర్మ మూవీస్పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.