అప్పుడలా.. ఇప్పుడిలా!

10 May, 2018 12:13 IST|Sakshi
అల్లు అర్జున్‌

మహేశ్‌బాబు ప్లేస్‌లోకి అల్లు అర్జున్‌ వచ్చారు. ఎలా అంటారా? ఇలా.. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్‌) చిత్రం గతేడాది జూన్‌ 23న రిలీజైంది. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ డేట్‌ను ‘స్పైడర్‌’ చిత్రం కోసం బుక్‌ చేసుకున్నారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ‘స్పైడర్‌’ సినిమా వాయిదా పడటంతో సభ్య సమాజానికి మేసేజ్‌ అంటూ ఆ ప్లేస్‌లోకి ‘డీజే’ వచ్చాడు. అలా గతేడాది మహేశ్‌బాబు ప్లేస్‌లోకి అల్లు అర్జున్‌ వచ్చారు. ఇప్పుడు..సూర్య వర్సెస్‌ భరత్‌లో మహేశ్‌ ముందొచ్చారు. అదేనండీ.. ముందు మహేశ్‌ ‘భరత్‌ అనే నేను’, తర్వాత ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వస్తున్నాయి కదా. అప్పుడలా.. ఇప్పుడిలా.

మరిన్ని వార్తలు