సుశాంత్‌ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు

17 Jun, 2020 14:56 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్యపై బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహర్‌, సల్మాన్‌ ఖాన్‌, ఏక్తాకపూర్‌లపై బిహార్‌ ముజఫర్‌ కోర్టులో బుధవారం కేసు నమోదైంది. సుధీర్‌ కుమార్‌ ఓజా అనే న్యాయవాది ఈ కేసు పెట్టారు. సుశాంత్‌ ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... సుశాంత్‌ ఆత్మహత్యపై నిర్మాత కరణ్‌ జోహార్‌, సంజయ్‌లీలా భన్సాలీ, ఏక్తాకపూర్‌, సల్మాన్‌ ఖాన్‌తో పాటు మరో 8 మందిపై బిహార్‌ ముజఫర్‌ కోర్టులో ఐపీసీ సెక్షన్‌ 306, 109, 504, 506 కింద పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు.  ('సుశాంత్‌ని 7 సినిమాల్లో త‌ప్పించారు')

సుశాంత్‌ను‌ 7 చిత్రాల నుంచి తొలగించారని, అంతేగాక అతడు నటించిన కొన్ని సినిమాలు విడుదలకానీయలేదని.. అందువల్లే ఒత్తిడికి గురైసుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐసీసీ సెక్షన్‌ 306(ఆత్మహత్యకు పాల్పడటం), 504(ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, అవమానించడం) 506(నేర బెదిరింపులకు శిక్ష) ప్రకారం వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు ఆయన చెప్పారు. కాగా, సుశాంత్‌ ఆదివారం(జూన్‌ 14)న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో సుశాంత్‌ బాధపడుతున్నాడని, దీనికి అతడు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. (‘సల్మాన్‌ నా కెరీర్‌ను నాశనం చేశాడు’)

ముసుగులు తొలగించండి

మరిన్ని వార్తలు