చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్పై అరవకురిచి పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో మొదటి తీవ్రవాది హిందువే అంటూ కమల్ హాసన్ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. దీంతో హిందువుల మనోభావాలను కించపరిచారంటూ కరూర్ జిల్లా పోలీసులకు రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమల్ హాసన్పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.