రకుల్ సీన్‌కు సెన్సార్‌ కత్తెర

16 May, 2019 10:10 IST|Sakshi

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సీనియర్ హీరో అజయ్‌ దేవగన్‌కు జోడిగా దే దే ప్యార్‌ దే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమాకు సెన్సార్‌ సభ్యులు కొన్ని కట్స్‌ సూచించారు. ఓ పాటలో రకుల్ ప్రీత్‌ సింగ్‌ విస్కీ బాటిల్‌ పట్టుకొని డ్యాన్స్‌ చేయటంపై సెన్సార్‌ బోర్డ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ సీన్‌ను కట్ చేయటం లేదా..? బాటిల్‌ కు బదులుగా పూలు పట్టుకున్నట్టుగా గ్రాఫిక్స్‌ చేయాలని సూచించారు. మరికొన్ని కట్స్‌తో సినిమాకు యు/ఏ  సర్టిఫికేట్‌ను జారీ చేశారు. అకీవ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు